మే 23, 2012
సహృదయ సాహితీ పురస్కారానికి రచనలు ఆహ్వానం
శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు…….
సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ నవలకు సహృదయ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేయాలని నిర్ణయంచింది. 2006 జనవరి నుండి 2011లోగా పుస్తక రూపంలో ప్రథమ ముద్రణ పొందిన నవల మాత్రమే ఈ పురస్కారానికి అర్హమైనది. రచయతలు తమ రచనలను పరిశీలనార్థం మూడు ప్రతులను మే 30వ తేదీలోగా పంపించాలి. ఉత్తమ నవలగా ఎంపికైన నవలకు నగదు పారితోషికం రూ.5,000లను సంస్థ వార్షికోత్సవం రోజున అందజేయ బడుతుందని సంస్థ ప్రధాన కార్యదర్శి డా. తుమ్మూరి లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. రచలను సహృదయ, ప్రధాన కార్యదర్శి, 2-2-492, కిషన్పురా, హనుమకొండ – 506 001 చిరునామాకు పంపాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Leave a Reply