డిసెంబర్ 18, 2013
ఆలస్యానికి దారేది?
అనుకోవాలి కానీ అసాధ్యమేముంటుందీ- అనుకునేవారు- కాళ్లు లేకపోయినా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరొహించగలరు. అమ్మో, అదెంత పెద్దపనో అనుకునే వారు- కుక్కర్లో బియ్యం కూడా పెట్టలేరు. రెండవ విశేషానికి ఉదాహరణలు- మన పార్లమెంట్లో మహిళా బిల్లు, లోక్పాల్ బిల్లు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఓడిపోవడంతో అధికారపక్షంలో వేడి పుట్టింది. ఒక రాష్ట్రంలో- అవినీతిపైకి బాణం ఎక్కుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి లభించిన అనూహ్య ప్రజాదరణతో, ప్రతిపక్షంలో ఉన్న బిజెపిలో వేడి పుట్టింది. ఆమ్ అద్మీ పార్టీ ముందు తన ఉద్యమం తేలిక పడిపోకూడదనుకున్న- అన్నా హజారేలో- కొంత సద్దుబాటుకి ఒప్పుకునైనా సరే- లోక్పాల్ బిల్లుని అమలులోకి తేవాలన్న వేడి పుట్టింది. అంతే! ఏళ్ల తరబడి ముందుకెళ్లని లోక్పాల్ బిల్లు రెండు రోజుల్లో రాజ్యసభ, లోక్సభల అమోదాన్ని పొందింది.
ఇప్పుడు లోక్పాల్ బిల్లు ఆమోదానికి ఘనత రాహుల్ది అని కాంగ్రెస్, కాదు మాదని బిజెపి- ప్రచారానికి సిద్ధపడుతున్నారు.
కానీ ప్రజలేమనుకుంటారు? దీనికి మహాభారతంలో ఓ కథ ఉంది. గురువు ద్రోణాచార్యుడు వంటవాళ్లని శాసించాడట- అర్జునుడికి చీకట్లో భోజనం పెట్టవద్దని. కానీ ఒకరోజు భోజన సమయంలో- గాలికి దీపాలు ఆరిపోయాయిట. అయినా ఆ చీకటి భోజనం చెయ్యడానికి అడ్డు రాలేదు. అప్పుడు అర్జునుడు అనుకున్నాట్ట- అలవాటైన పని చెయ్యడానికి చీకటి అడ్డు రాదని. అప్పట్నించీ చీకట్లో విలువిద్యని అభ్యసించడం ప్రారంభించి గురువు మెప్పుని పొందాడు అర్జునుడు. ఈ అంశంమీద గతంలో అర్జునుడూ-అనసూయమ్మా అనే మా కథ విజయ మాసపత్రికలో ప్రచురితమైంది. ఆ కథకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఇప్పుడు భారత పౌరుల ఆలోచనలు అర్జునుడి తరహాలో ఉండడం సహజం. ప్రజలకు అత్యవసరమైన ప్రతి బిల్లూ ఇంత త్వరగా అమల్లోకి రావాలని వారు అనుకోవడం సహజం.
ప్రజా ప్రతినిధులారా? లోక్పాల్ బిల్లుతో- అంతం కాదిది ఆరంభమనేలా- మీ పాలన ఉంటుందా? లేదా- ఆలస్యానికి దారేది- అని అన్వేషణ మొదలెడతారా?
ఈ అంశంపై మరో కోణంగా నేటి కార్టూన్ ఒకటి ఈ క్రింద ఇస్తున్నాం.
ఆకునూరి మురళీకృష్ణ said,
డిసెంబర్ 18, 2013 at 11:43 సా.
‘అర్జునుడూ అనసూయమ్మ’ కథ బాగుంది. చాలా పాత కథ అనుకుంటాను, సందర్భానుసారంగా మీరు శ్రధ్ధగా స్కాన్ చేసి పెట్టిన విధానం ఆకట్టుకున్నాయి. మీరు కథ చెప్పే విధానం అద్భుతం !! అందుకోండి మరోసారి అభినందనలు !!
వసుంధర said,
డిసెంబర్ 19, 2013 at 11:19 ఉద.
అప్పట్లో విజయ మాసపత్రిక కొత్తగా వచ్చిందని సరికొత్త కథలు ప్రత్యేకంగా వ్రాసి పంపితే- వరుసగా వెంటవెంటనే తిరిగొచ్చాయి. అవి వెంటవెంటనే ఇతర పత్రికలు ప్రచురించాయి. చివరకు ఓసారి చాలా పత్రికలు తిప్పి పంపిన ఈ అర్జునుడూ-అనసూయమ్మా కథని విజయకు పంపితే అది ప్రచురితమైంది. ఈ కథను చదివిన శ్రీ కొడవటిగంటి కుటుంబరావు- ‘ఈ వసుంధర ఎవరో కానీ- నాకు వారసత్వం స్వీకరించినట్లు అనిపిస్తోంది’ అన్నారని శ్రీ విజయ బాపినీడు తర్వాతెప్పుడో చెప్పారు. ఆ తర్వాత విజయ మాసపత్రికకు మేము ఆస్థాన రచయితలా అనిపించేటంతలా- మా కథలు, నవలలు ఆ పత్రికలో వచ్చాయి.
మీ మెయిలుకి ధన్యవాదాలు.
bonagiri said,
డిసెంబర్ 18, 2013 at 5:53 సా.
బానే ఉంది కాని, ఉద్యమకారులు, జనం రోడ్లమీదకు వచ్చి గొడవ చేస్తే తప్ప శాసనాలు చెయ్యరా?
ఇదేమి ప్రజాస్వామ్యం?
వసుంధర said,
డిసెంబర్ 18, 2013 at 6:26 సా.
జనం రోడ్లమీదకు వచ్చినా వారికి పట్టదు. ఎన్నికలు మీదకు వచ్చినప్పుడే వారి స్పందన