జనవరి 5, 2014
ఇది కథ కాదు
స్వరాజ్యానికి ముందు మహాత్ముడు భరతావని దాస్యవిమిక్తికి అహింసాయుత పోరాటాన్ని నిర్వహిస్తున్నప్పుడు- కొందరు విప్లవ మార్గాన్ని అనుసరించి అమరులై నేటికీ జనం నివాళులు అందుకుంటున్నారు. ఇప్పుడిది స్వతంత్ర భారతమైనా పాలనావ్యవస్థలో కుళ్లుని నమ్మక (భరించలేక) విప్లవమార్గాన్ని అనుసరిస్తూ నేరస్థులుగా, సమాజానికి శత్రువులుగా భావిస్తున్నవారున్నారు. అలాంటి ఓ వ్యక్తిని ఇతివృత్తంగా చేసుకుని 1979లో మేము వ్రాసిన తేడా కథ స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది. చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఐతే నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ విశేషం కథ కాదు. చదివితే కళ్లు చెమరుస్తాయి.
moorthy said,
జనవరి 6, 2014 at 3:26 సా.
తేడా కధ బాగుంది
తేడా స్పష్టంగా వుంది
స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాల తరువాత
ప్రధానమంత్రి లోక్ సభ లో ఈవిధంగా ప్రకటించారు
ఎఫ్ డి ఐ లకు అనుమతి ద్వారా విదేశి పెట్టుబడులు భారతదేశం లో కి తెచ్చి
ఎక్కువమందికి ఉద్యోగాలు వచ్చే అవకాసం కల్పించాము అని.
మరి 66 సంవత్సరాల క్రితం విదేసియులను ఎందుకు పంపించివేసాము ?
ఈరోజుకు కూడ భారతదేశం లోబతకడానికి కావలసిన ఉద్యోగాలు విదేసియులే కల్పించవలసి వస్తే
మన స్వాతంత్రానికి అర్ధం ఏమిటి?