ఫిబ్రవరి 7, 2020
జీవనసాఫల్య పురస్కారం – ఆచార్య ఎన్. గోపి

కలకత్తాలోని ప్రతిష్టాత్మక సంస్థ భారతీయ భాషా పరిషత్ ప్రముఖ తెలుగు కవి డా. గోపికి జీవన సాఫల్య పురస్కారాన్ని (కర్తృత్వ సమగ్ర సమ్మాన్) ప్రకటించింది. భాషా పరిషత్ భారతీయ భాషల సాహిత్య వికాసం కోసం 1975లో బెంగాల్ రాష్ట్రంలో ఏర్పడిన సంస్థ. ఇది భారతదేశ బహుళ వాద సంస్కృతిని, దేశ అఖండతనూ సృజనాత్మకతనూ ప్రోత్సహిస్తున్న క్రియాశీలక సంస్థ.
2019 సంవత్సరానికిగాను ఈ పురస్కారాన్ని ఒక తెలుగు కవికి ప్రకటించారు. డా. ఎన్. గోపి రచించిన “కాలాన్ని నిద్రపోనివ్వను, జలగీతం, నానీలు, వృద్ధోపనిషత్” తదితర గ్రంథాలు హిందీతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమైనాయి.
ఈ పురస్కారానికి గాను లక్ష రూపాయల నగదు, సన్మాన పత్రం, అంగవస్త్రం ప్రదానం చేస్తారు. ఈ మేరకు మార్చి 21, 2020న కలకత్తాలోని పరిషత్ సభాగారంలో జరిగే ప్రత్యేక సమావేశంలో (అలంకరణ సమారోహ్) పురస్కార ప్రదానం జరుగుతుందని భారతీయ భాషా పరిషత్ అధ్యక్షులు డా. కుసుమ్ ఖేమాని తెలిపారు.
(పరిషత్ ఉత్తరం జతచేయడమైనది)

Leave a Reply