అక్టోబర్ 21, 2020
పృచ్ఛకులకు ఆహ్వానం
2020 నవంబర్ లో 5-30 మధ్య ఏదో ఒకరోజు మాత్రం (భారత కాలమానం ప్రకారం 17:30-19:54) ఆన్లైన్ లో జరుగనున్న అష్టావధానం కార్యక్రమానికి ప్రాశ్నికులుగా ఉండదలచినవారు తమ వివరాలను క్లుప్తంగా vikramkumar.volunteer@gmail.com 8331926163 కి పంపగలరు
ప్రస్తుతం 8మందికే అవకాశం ఉంటుంది. మీరు ఎలాంటి ప్రశ్న అడుగుతారో రెండు నమూనా ప్రశ్నలు పంపగలరు.
పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరౌతారు.. కనుక వినతగినవే అడుగవలెను. పూర్వీకులు అనవసరమైనవి వ్రాయటం వల్ల భాష పట్ల అనాదరణ కలుగుతూ వచ్చింది. హంగూ ఆర్భాటాలు ఉండవు. ఉదాత్తమైన అంశాలతో మొదటి సారి అవధానం చూస్తున్నవారికి ఈ ప్రక్రియ పట్ల కుతూహలం కలిగేలా భాషా సాహిత్యాలపై గౌరవం కలిగేలా నిర్వహించాలని సంకల్పం.
ప్రాశ్నికులకు నియమాలు..
సమయపాలన చేయవలసి ఉంటుంది.మీకు ఇంటర్నెట్ _ కరెంటు లేకపోవడం వంటి ఇబ్బందులు ఉండరాదు. ఆన్లైన్ లో పాల్గొనటానికి తగినంత సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండాలి.
అనవసర ప్రసంగాలు వలదు(అప్రస్తుత ప్రసంగం చేసేవారు సైతం ఔచిత్యవంతంగా అడుగవలె)
స్వోత్కర్షలు/ సాగతీత / చౌకబారు వ్యవహారం నిషేధం.
మరీ ఎక్కువ మంది తమ వివరాలు పంపితే భవిష్యత్తులో చేసే కార్యక్రమాలకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
ధన్యవాదములు—-పద్యాల విక్రమ్ కుమార్ https://www.linkedin.com/in/विक्रम-vikram-कुमार-kumar-85424172
Leave a Reply